నల్గొండ జిల్లా : దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల కేంద్రంలోని జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేషమైన స్పందన ఉందన్నారు ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు.