శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలంలో గల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో మూడవరోజు భక్తులకు దర్శనమిచ్చారు.