పామూరు పట్టణంలోని పలు లాడ్జిలను గురువారం ఎస్సై కిషోర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాడ్జిలలోని రికార్డులను ఆయన పరిశీలించారు. లాడ్జిలలో కొత్త వ్యక్తులు ఎవరైనా బస చేశారా అనే వివరాలను లాడ్జి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. లాడ్జిలలో అనుమానిత మరియు కొత్త వ్యక్తులు ఎవరైనా బస్సు చేసినట్లు అనుమానం వస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని ఎస్ఐ సూచించారు. అదేవిధంగా లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని లాడ్జి నిర్వాహకులను ఎస్ ఐ హెచ్చరించారు.