నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలోని మూసి రోడ్డులో గల సబ్ స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బైక్, ఎక్సెల్ బైకును ఢీకొనగా ఈ ప్రమాదంలో తాటికల్ గ్రామానికి చెందిన జానయ్య, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.