సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశించారు . సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్, విద్యుత్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.