Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులను నియమించాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు

Rayadurg, Anantapur | Sep 3, 2025
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వేదిస్తోందని తక్షణమే కనీసం ముగ్గురు వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు కోరారు. బుధవారం మద్యాహ్నం ఆయన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు ఫోన్ చేసి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషంట్, ఇన్ పేషెంట్ వివరాలు తెలుపుతూ వైద్యులను నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఓపి పెరిగిందని, ఉన్న కొద్దిమంది డాక్టర్లపై పని భారం పెరిగిందనికూడా ఫోన్ లో వివరించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కాలవకు హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us