రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ గోశాలలోని ఈనెల 14న జరిగే కోడెల పంపిణీ రద్దు చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో రేపు ఆదివారం రోజున కోడలు పంపిణీ కార్యక్రమాన్ని అనివార్య కారణాలవల్ల రద్దు చేసినట్లు తెలిపారు. రాజన్న కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరూ గమనించాలని సూచించారు. కోడెల పంపిణీ మళ్లీ తదుపరి తేదీని ఎప్పుడు పంపిణీ చేస్తామనే విషయం ప్రకటిస్తామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.