మేళ్లచెరువు మండల PACS వద్ద శనివారం మహిళ రైతు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఉదయం నుండి రైతులు క్యూలలో నిలబడి ఉండగా గిరిజన మహిళ బాణావతి బుజ్జి, ఉదయం నుండి జూలైలో నిలబడి తీవ్ర అలసటకు గురై ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. ఎరువుల సరఫరాలో ఆలస్యం, అధికరద్దీ, సర్వర్ సమస్యలతో రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.