ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ఆదివారం ఉదయం 8గంటల సమయంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎస్పి తుషార్ డూడీ సైకిల్ తొక్కి సందడి చేశారు.ఎస్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరగగా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుధ్యానికి సైకిల్ తొక్కడం ఎంతగానో ఉపకరిస్తుందని, ఖర్చుతో కూడిన వ్యాయామాలు అవసరం లేదని పేర్కొన్నారు.తల్లిదండ్రులు కూడా పిల్లలకు సైకిల్ ప్రయోజనాలను వివరించాలని ఉద్బోధించారు.