జనసేన పార్టీ శ్రేణులతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైజాగ్లో ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి సోమవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో 'సేనతో సేనాని' పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని నిరంతరం కృషి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు.