తిరుమలగిరిలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం ఉదయం తెల్లవారుజామున యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. పీఏసీఎస్ కార్యాలయం ముందు రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి ఎదురుచూస్తున్నారు. వచ్చిన యూరియా పూర్తిస్థాయిలో రైతులందరికీ అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.