ఈ.ఎం.ఆర్.ఎస్. క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం మర్రిమడ్ల నందు గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పాల్గొన్నారు.మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..మంత్రి స్థాయిలో ఈ ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందన్నారు