బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్నగర్ మెట్రో పెట్రోల్ బంక్ వద్ద సీఐ సుధాకర్ ప్రత్యేక వాహన తనిఖీలు చేశారు. ఇటీవల షాహీన్నగర్లో జరిగిన ప్రమాదంలో బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటనను ఆయన గుర్తు చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, బైక్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.