కరీంనగర్ కలెక్టరేట్ ముందు టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 CPS విద్రోహ దినంను పురస్కరించుకొని సోమవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుర్దించాలని, పెన్షన్ అనేది బిక్ష కాదని, ఉద్యోగుల హక్కుని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.