Download Now Banner

This browser does not support the video element.

నార్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, ఏకలవ్య పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Narnoor, Adilabad | Aug 16, 2024
నార్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు.ఆసుపత్రిలోని రికార్డులు,రిజిస్టర్ లను పరిశీలించారు.జ్వర సంబంధిత వివరాలను పరిశీలించి మలేరియా, డెంగ్యూ, సాధారణ జ్వరాలకు సంబంధించి రిజిష్టర్ లు వేరువేరు గా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలియ తిరుగుతూ గర్భిణీ స్త్రీలకు చేస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నార్నూర్ ఏకలవ్య ఆదర్శ పాఠశాల ను సందర్శించి స్టోర్ రూం, డార్మెటరీ, డైనింగ్ హాల్ లను పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us