సత్తెనపల్లి బస్టాండ్ ఎదురుగా శనివారం RTC బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.