ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీ డిమాండ్ చేశారు. బృందావన్ గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో ఆదివారం అంబటి మాట్లాడారు. కొండవీటి వాగు పొంగి గుంటూరు ఛానల్లోకి రావడంతో ప్రవాహం ఎక్కవై కట్టలు తెగి పొలాల్లోకి నీరు వెళ్లిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయని పక్షంలో రైతుల్ని కలుపుకొని ఉద్యమని చేపడతామని ఆయన తెలిపారు.