రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కార్డులను మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్నామని, 4వేల పెన్షన్లు అందించడం కూడా రాష్ట్రంలోనే జరుగుతోందన్నారు.