సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో యూరియా కోసం వచ్చిన రైతుల మధ్య తోపులాట జరిగింది. యూరియా కోసం భారీ సంఖ్యలో రైతులు బారులు తీరగా, తోపులాట జరగడంతో అక్కడే ఉన్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యూరియా అందక అరిగోస పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు