నల్గొండ జిల్లా, దామరచర్ల మండల కేంద్రంలోని గణేష్ పహాడ్ మూలమలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీని మిర్యాలగూడ రోడ్డు నుంచి దామరచర్ల రోడ్డుకు దాటుతున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.