అనంతపురం నగర శివారులోని కందుకూరు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ధర్మవరం పట్టణానికి చెందిన పార్వతమ్మ వెంకటరమణ అనే దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ధర్మవరం నుంచి అనంతపురం కు తమ కుమార్తెను చూసేందుకు వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.