హనుమంతునిపాడు మండలం నందనవనంలోని మల్లప్ప శల క్షేత్రంలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. నందనవనంలోని అంబా మల్లేశ్వరిస్వామి ఆలయ గర్భగుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసి వెలుపల వేసిన దుండగులు లోపల ఐదు అడుగుల గొయ్యి తవ్వారు. పక్కనే ఉన్న రంగనాయకస్వామి ఆలయం వెనుక నుంచి విగ్రహం కిందిభాగం వరకూ 20 అడుగుల లోతుగొయ్యి తీశారని గ్రామస్థులు తెలిపారు. అధికారులు స్పందించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.