Download Now Banner

This browser does not support the video element.

చిలుకూరు: రోడ్లపై ధాన్యం ఆరబోయొద్దని రైతులకు సూచించిన నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్

Chilkur, Suryapet | Apr 18, 2025
నడిగూడెం మండలంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని ఎస్సై అజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో పలు ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం ఆరబోసుకోవాలన్నారు. ధాన్యం కుప్పల వద్ద ప్రమాదాలు జరిగితే చర్యలు తప్పవన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us