అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా నిర్వహించిన మండల స్థాయి టీచర్స్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు అనేది ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం వెలుగు చూపే దీపమని ఆ దీపాన్ని వెలిగించేది ఉపాధ్యాయాలని సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వమైందని అన్నారు.. అనంతరం మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ రోడ్డు వైన్డింగ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు...