ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడును మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా కలిసి అభినందించారు. విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును స్పీకర్ అయ్యన్నపాత్రుడు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.