సింగరేణి కార్మికుల సంక్షేమానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి కొమురయ్య చేసిన కృషి చిరస్మరణీయమని ఏఐటీయూసీ నాయకులు వీరభద్రయ్య, సమ్మయ్య, బాజీసైదా అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కొమురయ్య వర్ధంతి సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు గని కార్మికులకు పెన్షన్ అందించిన ఘనత కొమురయ్య దే అని పేర్కొన్నారు.