Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: వివోఎలకు కనీస వేతనం ₹26000, ₹15 లక్షల జీవిత బీమా కల్పించాలని, పని భారం తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

Bhimavaram, West Godavari | Sep 5, 2025
భీమవరం సిఐటియు కార్యాలయంలో వివోఎల జిల్లా విస్తృత సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3:30 కు జరిగింది. సమావేశానికి నాగిడి గోవిందమ్మ అధ్యక్షత వహించగా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి. వాసుదేవరావు అనంతరం జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న వివోఎలకు కనీస వేతనం ₹26,000, ప్రతి ఒక్కరికి ₹15 లక్షల జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళా సంఘాలు ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నప్పటికీ వివోఎలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. యాప్‌లతో పనిభారం పెంచుతున్నారని, పెరుగుతున్న ధరలు, అద్దెలు, కరెంట్ ఛార్జీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us