సిద్దిపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు అధ్యక్షతన శనివారం మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ , కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మరియు ఇతర శాఖలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏజెండాలో 2 అంశాలను పొందుపరచగా పాలకవర్గం ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను తెలుపగా చైర్ పర్సన్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.