Parvathipuram, Parvathipuram Manyam | Aug 28, 2025
రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పలువురి సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పాచిపెంట మండలంలోని గురువునాయుడుపేట పంచాయతీలో ఉన్న 11 గ్రామాల రైతులు మంత్రిని కలిసి ,ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోతోందని, వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వివరించారు. దీంతో స్పందించిన మంత్రి సంధ్యారాణి, వెంటనే విద్యుత్ శాఖ