ఒంగోలులోని దర్శనం బజారులో విజ్ఞేశ్వర బాల భక్త సమాజం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శంఖాలతో రూపొందించిన గణేశుని విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఏడాది గణేశుని విగ్రహాన్ని వినూత్నమైన రీతిలో ఈ సమాజం రూపొందిస్తోంది. సముద్ర తీరంలో శంఖాలను పోగుచేసి ఈ పర్యాయం వినాయకుని విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బుధవారం రాత్రి ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు