పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్ లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుండి పర్యాటకులకు పద్మాపురం గార్డెన్ లో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. హాట్ ఎయిర్ బెలూన్ లో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.