మంచిర్యాల జిల్లాల్లో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 1గంట ప్రాంతం లో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ జన్నారం మండలలో మూడెకరాల సీలింగ్ భూమిని వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.