వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతు పిడుగు పాటుకు గురైన ఘటన కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు వివరాల్లోకి వెళితే బుధవారం సాయంత్రం సర్వాయిపేట గ్రామంలో రాజమల్లు అనే రైతు పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంలో అతని పై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో రాజమల్లుకు తీవ్ర గాయలు కాగా ప్రక్క పొలంలో పనులు చేసుకుంటున్న రైతు చూసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అతన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.