సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో 273.40 కోట్లతో 500 పడకల ఆసుపత్రి నూతన భవనానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులను త్వరగా నాణ్యతతో నిర్మించాలని, నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు వైద్యశాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు డిఎంఇ వాని తదితరులు పాల్గొన్నారు.