చేవెళ్ల మున్సిపల్ మండల పరిధిలో ప్రవాస్ యోజన (పల్లె పల్లెకు బీజేపీ) కార్య క్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు ప్రారంభించారు. బీజేపీ నాయకులు గజమాలతో వారికి ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.