స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చిన కూటమి నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో మంగళవారం సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి నళినీకాంత్ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. బుధవారం తలపెట్టిన విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.