మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్షాలను అణచివేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.కేసీఆర్, హరీష్ రావులపై తప్పుడు కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదమని పేర్కొన్నా