మదనపల్లి మండలం,అంకిశెట్టిపల్లి నల్లగుట్టలో ఎవరికి అనుమతులు లేవని మదనపల్లి తహసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తహసిల్దార్, సీఐ మీడియాతో మాట్లాడుతూ.. అంకి శెట్టిపల్లి నల్లగుట్ట విషయంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంపై గుట్టపై కి వెళ్లడానికి ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అది ప్రభుత్వ భూమి అన్నారు. తమ అనుమతి లేకుండా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, సభలు సమావేశాలు విగ్రహం ఏర్పాటు నిర్వహించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.