పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. కొందుర్గు మం.లోని బాలుర గురుకుల పాఠశాలతో పాటు కళాశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులు నేలపై కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి హాస్టల్ను సందర్శించాలని కోరారు