నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలోకి ఎగువ మహారాష్ట్ర, జిల్లాలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులకు కాగా ప్రస్తుతం 1181.9 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో 620 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో ఒక్క గేటు ద్వారా 980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు. స్వర్ణ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.