మియాపూర్లో 5వ అంతస్తుపై నుంచి దూకి పదోతరగతి విద్యార్థిని హన్సిక(14) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న BRSV, AISF, SFI విద్యార్థి సంఘాల నాయకులు, బాలిక కుటుంబ సభ్యులు ఈరోజు మియాపూర్ లోని సెయింట్ మార్టిన్ హైస్కూల్ ముందు నిరసనకు దిగారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.