Download Now Banner

This browser does not support the video element.

తిరుమలగిరి సాగర్: అల్వాల వద్ద ప్రమాదకరంగా మారిన నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఆందోళన చెందుతున్న సమీప గ్రామాల ప్రజలు

Tirumalagiri Sagar, Nalgonda | Feb 24, 2025
నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, అల్వాల గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ ప్రమాదకరంగా మారింది. కాల్వకు చేపట్టిన రైలింగ్ పనులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ఏ క్షణంలో గండిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతూ సోమవారం సాయంత్రం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిరకం పనులు చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు. గతంలో వేంపాడు వద్ద ఎడమ కాలువకు గండిపడి వేల ఎకరాలలో పంటలు కొట్టుకుపోయిందని, అదే పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us