Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 31, 2025
ఉలవపాడు (m) కరేడులో ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని రామకృష్ణాపురం గిరిజన కాలనీ మహిళలు మరోసారి తేల్చి చెప్పారు. భూసేకరణ ప్రక్రియలో భాగంగా సామాజిక సర్వేని పరిశీలించడానికి వెళ్లిన సబ్ కలెక్టర్ హిమవంశీ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వం అన్నందుకు తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపారన్నారు. 'ఎంతమందిని జైలుకు పంపుతారో పంపండి కానీ భూములు మాత్రం ఇవ్వం' అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.