దేవనకొండ మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 నెలల కుమారుడిని హత్య చేసి, భార్యపై భర్త దాడి చేసిన ఘటనలో ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు మండిపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం దేవనకొండ బస్టాండ్ వద్ద పోలీస్ డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. నిరసనకారులు రోడ్డును బ్లాక్ చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.