బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పి తుషార్ డూడీ నేరుగా ప్రజల వద్ద నుండి అర్జీలు సేకరించారు.వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.తనకు అందిన 58 అర్జీలను ఆయన సంబంధిత పోలీసు అధికారులకు ఎండార్స్ చేశారు.నిర్ణీత కాల వ్యవధిలో, చట్టపరిధిలో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఆయన వారిని ఆదేశించారు.నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.