Araku Valley, Alluri Sitharama Raju | Aug 30, 2025
అరకులోయ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతగిరి, హుకుంపేట మండలాలకు ఆనుకుని ఉన్న మజ్జివలసలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టు చేపడితే గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. 15 -20 గ్రామాలు జల సమాధి అవుతాయన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు