కామారెడ్డి జిల్లాలో అధిక వరదలు సంభవించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహ్వానం మేరకు వరుసగా రెండవ రోజు ఆదివారం జిల్లాలో రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని పోల్కంపేట్ రైతువేదికలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంపులో బల్కంపేట్, పోల్కంపేట్ తండా, కోమటిపల్లి పోతాయిపల్లి, కన్నాపూర్, సుమారు 252 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గు, జలుబు,నొప్పులు, బిపి, షుగర్ తదితర వ్యాధులకు మెడిసిన్ అందించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మట్ ప్రతినిధులతో పాటు ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి, స్థానికత తాసిల్దార్ ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.