ఈనెల 19,20 తేదీలలో తణుకులో జరుగనున్న సీపీఐ 27 వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సోమవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు పార్టీ మహాసభల ప్రజా ప్రదర్శన, బహిరంగ సభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ మహాసభలు సందర్బంగా ఈనెల 19 న తణుకు పట్టణంలో జరుగనున్న ప్రజా ప్రదర్శన బహిరంగ సభలకు సీపీఐ, ప్రజా సంఘాల శ్రేణులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.