నరసాపురం 14వ వార్డులోని అంకానివారి పాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు పెమ్మాడి నాగరాజు హైదరాబాద్ నుంచి తెప్పించిన 3,000 నెమలి ఈకలతో కుమారస్వామి అవతారంలో ఉన్న వినాయకుడిని చేయించారు. ఈ అద్భుతమైన విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ విగ్రహం తయారీకి సుమారు రూ. 80,000 ఖర్చు అయినట్లు నిర్వాహకులు తెలిపారు.