సంగారెడ్డి పట్టణంలో పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాస్ పోర్ట్ కేంద్రం కోసం ఇప్పటికే సంతకాల సేకరణ కార్య క్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఎడ్యు కేషనల్ హబ్గా ఉన్న సంగారెడ్డిలో పాస్ పోర్ట్ కేంద్రం లేకపోవడం సరికాదని పేర్కొన్నారు